ముద్ర న్యూస్ బ్యూరో ,మొయినాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమ బుధవారం నాడు ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. కనకమామిడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ రాఘవేందర్ రెడ్డి, ఏఎంసి డైరెక్టర్ బాలకృష్ణారెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ లు జనార్దన్ రెడ్డి, ఆకుల పద్మారావు, మొయినాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మర్రి రవీందర్ రెడ్డి, ఎమ్మెస్ రత్నం, గోవిందు నరసింహా రెడ్డి, ఇందిరమ్మ కమిటీ మెంబర్ ఆలూరి రాములు, రేషన్ డీలర్ అనంతరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మర్రి వంశీధర్ రెడ్డి, గాజుల లడ్డు, పట్లోళ్ల రాము, గోవిందు సుధాకర్ రెడ్డి, ఏ కృష్ణారెడ్డి, రావి చెట్టు గణేష్, ఈరన్ రాజు మల్లేష్, చిన్న జుంజూరు శీను, ఆలూరు మల్లేష్, ఫైనాన్స్ శ్రీకాంత్ రెడ్డి, గోవిందు రాఘవరెడ్డి, పామేన హరేందర్, గూడెం యాదయ్య, సందీప్, గౌండ్ల రాఘవేందర్ సకాలి సురేష్ మరియు గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.