Take a fresh look at your lifestyle.

తన ప్రతిష్టను దెబ్బతీయాలనే ప్రయత్నం: కేటీఆర్, హరీశ్ రావులపై డా. సంపత్ కుమార్ ఫైర్

ముద్ర, బండ్లగూడ:

తన పరువు తీస్తూ తనపై ఉద్దేశపూర్వకంగానే బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, డాక్టర్ శ్రీశాంక్ లు ఆరోపణలు చేస్తూ తనను మనోవేదనకు గురి చేస్తున్నారని ఎఐసిసి కార్యదర్శి డాక్టర్ సంపత్ కుమార్ అన్నారు. బి ఆర్ ఎస్ కు సంబంధించిన నమస్తే తెలంగాణ దినపత్రికలో, తెలుగు స్కైబ్ యూట్యూబ్ ఛానల్ లలో ఉద్దేశ పూర్వకంగానే కథనాలు వేయించి ఒకటి తర్వాత ఒకరు ప్రెస్ మీట్ లు పెట్టారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ నార్సింగి ఏసీబీకి కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. 2026 జనవరి 12న, నాపై తప్పుడు మరియు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న తెలుగు స్క్రైబ్ అనే డిజిటల్ మీడియా సంస్థలో “8 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం” అనే శీర్షికతో ఒక ఇలాంటి వార్తా కథనాన్ని చూశాను అన్నారు . ఆ తర్వాత 14-01-2026న, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కె. టి. రామారావు ఒక పత్రికా సమావేశం నిర్వహించి, నేను జాతీయ రహదారి కాంట్రాక్టర్‌ను ప్రాణాంతక ఆయుధాలతో బెదిరించినప్పటికీ, ఎటువంటి చర్య తీసుకోలేదని ప్రత్యేకంగా పేర్కొంటూ నాపై అటువంటి తప్పుడు మరియు నిరాధారమైన ఆరోపణలు చేశారన్నారు.15-01-2026న, సిద్దిపేట ఎమ్మెల్యే శ్రీ టి. హరీష్ రావు జహీరాబాద్‌లో ఒక పత్రికా సమావేశం నిర్వహించి, కాంట్రాక్టర్ ఫిర్యాదు కాపీని చూపిస్తూ, జనవరి 9న ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు నన్ను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నిస్తూ నాపై ఇలాంటి తప్పుడు మరియు నిరాధారమైన ఆరోపణలు చేశారు అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన డాక్టర్ క్రిశాంక్ కూడా బ్రహ్మ నుండి రూ. 8 కోట్లు డిమాండ్ చేశానని మరియు ఆయుధాలతో బెదిరించానని తనపై అటువంటి తీవ్రమైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. తనను మరియు గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని అప్రతిష్టపాలు చేయాలనే ఏకైక ఉద్దేశ్యంతోనే వారు ఇలాంటి నిజమైన పనులు చేస్తున్నారన్నారు . తనను కించపరిచే ఆరోపణలు మానుకోకపోతే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.