ముద్ర ప్రతినిధి, జగిత్యాల: వరంగల్ లో నిర్వహించనున్న బిఆర్ ఎస్ రజతోత్సవ సభ వాల్ రైటింగ్ ను జగిత్యాల నియోజకవర్గంలోని అర్బన్ మండలం తిప్పనపేటలో మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ప్రారంభించారు.ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ వరంగల్ సభకు బిఆర్ ఎస్ శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. అక్కడున్న స్థానిక ప్రజలు వాసనతో మాట్లాడుతూ సభకు తరలి రావడానికి చాలా ఉత్సాహంగా ఉన్నామని తెలిపారు.
