ముద్ర, వనపర్తి :

వనపర్తి జిల్లాలోని వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత ఐదు పురపాలికల్లో బుధవారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై సాయంత్రం ఐదు గంటలకు ప్రశాంతంగా ముగిసింది.
మొత్తం 5 మున్సిపాలిటీల పరిధిలో పరిధిలో ని 80 వార్డులకు, 191 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగింది.
వనపర్తి జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఎన్నికల ప్రక్రియను అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య తో కలిసి పర్యవేక్షిస్తున్నారు.