ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ నియోజకవర్గం సారంగాపూర్, కౌట్ల ల్లో పలు అభివృద్ధి పనులకు ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. కౌట్ల (బి) లో రూ.1.60 లక్షల నిధులతో చేపట్టే పనుల్లోభాగంగా గ్రామంలో రూ.30 లక్షలతో ఎస్ హెచ్ జీ భవనాల నిర్మాణానికి,రూ.30 లక్షలతో మూడు వర్కింగ్ షెడ్ల నిర్మాణానికి,రూ.24 లక్షలతో రెండు అంగన్వాడీ భవనాల నిర్మాణానికి, రూ.2 లక్షలతో జడ్పి స్కూల్ కాంపౌండ్ నిర్మాణానికి, రూ. 20 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజ్ ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే మండల కేంద్రంలో కూడా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.