- జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల రుణం అభివృద్ధి చేసి తీర్చుకుంటానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. పట్టణంలోని 4 వార్డులో టియుఎఫ్ఐడిసి ఫేస్ 1లో భాగంగా రూ.30 లక్షల నిధులతో సీసీ డ్రైనేజ్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బుధవారం భూమిపూజ చేశారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ చైర్మన్ లు అడువాల జ్యోతి, గిరి నాగభూషణం, మాజీ కౌన్సిలర్ క్యాదాసు నవీన్, ఏఈ అనిల్, ఎవో శ్రీనివాస్, టీఎంసీ రజిత, మాజీ కౌన్సిలర్ లు, నాయకులు పురుషోత్తం రావు, బాల శంకర్, శరత్ రావు, నారాయణరెడ్డి, ముస్కు ఎల్లారెడ్డి, రమేష్, సత్యనారాయణ రెడ్డి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.