- మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు.
- సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో జాతీయ వైద్య దినోత్సవం వేడుకలు.
ముద్ర ప్రాతినిధి, జగిత్యాల: వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదేనని, ప్రాణాలు పణంగా పెట్టి రోగులకు సేవలంధిస్తున్నామని మాతా శిశు కేంద్ర జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ సుమన్ మోహన్ రావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్ర సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆస్పత్రిలో తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశిష్ట సేవలు అందిస్తున్న మాతా శిశు కేంద్ర,మెడికల్ కాలేజీ, ఐఎంఎ అసోసియేషన్ డాక్టర్లను సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,ఆర్.ఎం.పి.రాష్ట్ర అధ్యక్షుడు రాజా గోపాల్ చారి లు ఘనంగా సన్మానించారు. మాతా శిశు సూపరెండేంట్ సుమన్ మోహన్ రావు, ఆర్.ఎం.వో.లు డాక్టర్లు గీతిక, శ్రీపతి, విజయా రెడ్డి, నరేష్, మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సునీల్, ప్రొఫెసర్లు రఘు, ప్రవీణ్,అర్చన, శిల్ప, ప్రదీప్, స్రవంతి, సింధూజ లను ఐ.ఎం.ఏ.అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జి.హేమంత్, ప్రధాన కార్యదర్శి ఎశ్రీనివాస్ రెడ్డి, సంతోష్ రెడ్డి, ట్రెజరర్ సుధీర్, దంత వైద్యుడు డాక్టర్ హరి విక్రమ్ లను పట్టు శాలువాలతో, విశిష్ట సేవా పురస్కారాల్తో సన్మానించారు. ఈ సందర్భంగా హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్లు ప్రత్యక్ష దేవుళ్ళని,తెలంగాణను ఆరోగ్య తెలంగాణ మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టడం హర్షణీయమన్నారు.మాతా శిశు కేంద్రం,ప్రభుత్వ ప్రాంతీయ వైద్య శాలల్లో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో, ఐఎం.ఎ.ఆధ్వర్యంలో డాక్టర్లు అందిస్తున్న సేవలను కొనియాడారు.జగిత్యాల జిల్లా మెడికల్ హబ్ గా మారడంతో జిల్లా ప్రజలకి ప్రభుత్వం తరపున ఆరోగ్యశ్రీ కింద ఉచిత డయాలసిస్ సేవలు, 60 రకాల ఆరోగ్య పరీక్షలు ఉచితంగా అందజేస్తున్నారని డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ సిటీజేన్స్ ఉపాధ్యక్షుడు పి.హన్మంత రెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి కే.సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి దిండిగాల విఠల్, మాతా శిశు కేంద్ర, డాక్టర్లు, మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లు, నర్సింగ్ సిబ్బంది, వైద్య సిబ్బంది, సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.