Take a fresh look at your lifestyle.

ఈవీఎం గోదాము తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలన…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు బుధవారం రోజున జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ దరూర్ క్యాంప్ లో గల ఈవీఎం లను భద్రపరిచిన గోదామును తనిఖీ చేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతినెల ఈవీఎం లను తనిఖీ చేయడం జరుగుతుందని గోడౌన్ లోని యంత్రాల భద్రత, సిసి కెమెరాల పనితీరు, సాంకేతిక పరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించడం జరిగిందని తెలిపారు.
గోదాము వద్ద ఎలాంటి లోపాలు లేకుండా పటిష్టమైన భద్రత ఉండాలని, నిత్యం అప్రమత్తతతో పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు. ఇందులో కలెక్టరేట్ వెంట అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్ లత, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు, కలెక్టరేట్ ఏవో హకీమ్, జగిత్యాల అర్బన్ ఎమ్మార్వో రామ్మోహన్ మరియ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.