Take a fresh look at your lifestyle.

”అందరికీ అమ్మ” పుస్తకాన్ని ఆవిష్కరించిన కేసీఆర్

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ తల్లి విశిష్టతను వివరిస్తూ రూపొందించిన ”అందరికీ అమ్మ” అనే పుస్తకాన్ని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్ రచించారు. ఇదివుండగా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పలువురు బి ఆర్ ఎస్ మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , మాజీ ఎమ్మెల్యేలు , ప్రజా ప్రతినిధులు శనివారం బి.ఆర్.ఎస్ అధినేత కేసీఆర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

కేసీఆర్ గారిని కలిసిన నేతల్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు జి. జగదీష్ రెడ్డి , వేముల ప్రశాంత్ రెడ్డి , ఎమ్మెల్సీలు తాతా మధు , ఎం సి కోటిరెడ్డి , జడ్పీ చైర్మన్లు బండ నరేందర్ రెడ్డి , ఎలిమినేటి సందీప్ రెడ్డి , మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ , మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి , రమావత్ రవీంద్ర కుమార్ , బొల్లం మల్లయ్య యాదవ్ , గొంగిడి సునితా మహేందర్ రెడ్డి , గ్యాదరి కిషోర్ కుమార్ , కందాల ఉపేందర్ రెడ్డి , నల్లమోతు భాస్కర రావు , కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి , బూడిద భిక్షమయ్య గౌడ్ , పలువురు బి ఆర్ ఎస్ నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి , నర్సింహా రెడ్డి , పాల్వాయి స్రవంతి , రేగట్టే మల్లిగార్జున్ రెడ్డి , మందడి సైదిరెడ్డి , చింతల వెంకటేశ్వర్ రెడ్డి , పల్లె ప్రవీణ్ రెడ్డి , నేవూరి ధర్మేందర్ రెడ్డి , వలమల కృష్ణ , నూకల యుగంధర్ రెడ్డి , తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.