- విగ్రహాలు,వీధులకు పేర్లు,స్వాగత అర్చీలు పెట్టి గౌరవిద్దాం
- ఇనుముల సత్యనారాయణ, న్యాయవాది,మంథని మాజీ ఉపసర్పంచ్
మంథని, ముద్ర : మంథని మున్సిపల్ పరిధిలో ప్రజా ప్రతినిధులుగా,స్వాతంత్ర సమర యోధులుగా,నిజాం నవాబు పాలనపై పోరాటం చేసిన వీరులుగా తెలంగాణ ఉద్యమ కారులుగా ఉండి మంథని ప్రాంతానికి సేవ చేసి,మంథని కీర్తిని విశ్వవ్యాప్తం చేసి అమరులైన వారిని పార్టీలకు అతీతంగా పలువురు మహనీయులకు విగ్రహాలు,వారి పేర్లపై పట్టణంలోని పలు వీధులకు,రోడ్లకు నామ పలక బోర్డులు ఏర్పాటు చేసి,వారిని నిత్యం స్మరించే విధంగా మంథని మహనీయుల చరిత్రను భావితరాలకు అందించాలని కోరుతూ మంథని మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి,అడిషనల్ కలెక్టర్, స్థానిక సంస్థలుర కి మరియు మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్ రెడ్డి కి మాజీ ఉప సర్పంచ్,న్యాయవాది ఇనుముల సతీష్ గురువారం వినతిపత్రం అందించారు.