మహాదేవపూర్, ముద్ర: 42 వసంతాల తర్వాత ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో తలపెట్టిన మహా కుంభాభిషేకం ప్రారంభమైంది. ప్రాతకాలం ఆరు గంటలకు మేళతాళాలతో త్రివేణి సంగమం వద్దకు పేదమూర్తులు భక్తులు బయలుదేరి వెళ్లి కుంభాలలో జలాన్ని ఆలయంలోకి చేర్చారు. ఇంతకుముందే తీసుకురాబడిన ఏడు నదుల యొక్క జలాలను మహా చండీ హోమంలో ఉంచారు.అనంతరం మూలవిరాట్టు గా ఉంటున్న శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి లింగాలను అభిషేకించి మహా సంప్రోక్షణ కావించారు.అనంతరం శుభానంద దేవి, సుబ్రహ్మణ్యస్వామి ఆలయం,విజయ గణపతి ఆలయం,శ్రీ సరస్వతి మాత ఆలయం, సూర్య దేవుని ఆలయం,ఆది ముక్తేశ్వర స్వామి ఆలయం,సీతారామాంజనేయ స్వామి ఆలయాలలో సంప్రోక్షణ అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు.ఈ క్రతువులు నిర్వహించడంలో అర్చలాపురానికి చెందిన వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహాకుంభాభిషేకంలో ఆలయ ఈవో మహేష్ పుర ప్రముఖులు వేద పండితులు పాల్గొన్నారు.