Take a fresh look at your lifestyle.

మల్కాజిగిరి అభివృద్ధికి నిధులు కేటాయించండి -ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

 

ముద్ర మల్కాజిగిరి

మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధి నిధులు కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ని కలిసి కీలక వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా మల్కాజ్గిరిలో నిర్మాణంలో ఉన్న కోర్టుల భవన సముదాయం , ఫ్యామిలీ కోర్టులతో సహా పనుల పురోగతి పై మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. సుమారు రూ. 90 కోట్ల వ్యయంతో కొనసాగుతున్న ఈ ప్రాజెక్ట్‌లో ఇప్పటికే దాదాపు 28.5% పనులు పూర్తయ్యాయి.
అయితే కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన రూ. 2.80 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో పనులు నెమ్మదించే పరిస్థితి ఏర్పడింది. దీంతో కార్మికులు, సరఫరాదారులకు చెల్లింపులు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఈ సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే వెంటనే బిల్లులు విడుదల చేసి పనులను వేగవంతం చేయాలని మంత్రి ని కోరారు. మల్కాజిగిరి ప్రజలకు న్యాయ సేవలు మరింత సులభంగా అందేలా ఈ ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తి చేయాల్సిన అవసరాన్ని ఆయన హైలైట్ చేశారు.
దీనిపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మొత్తంగా చూస్తే, కోర్టు భవన సముదాయం పనులు మళ్లీ వేగం పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. మల్కాజిగిరి ప్రజలకు త్వరలోనే మెరుగైన న్యాయ వసతులు అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.