ముద్ర, మహదేవపూర్:
మండలంలోని మందరగిరి శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో మూడవ తారీకు సాయంకాలం నిర్వహించు డోలోత్సవాన్ని చంద్ర గ్రహణం కారణంగా ముందు రోజుకు మార్చనైనదని అర్చకులు తిరునగరి నవీన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి నాలుగో తారీఖు బుధవారం సంప్రోక్షణ అనంతరం 11 గంటలకు డోలోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించబడును. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగలరు. చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 6 :30 నుండి తెల్లవారి ఏడు గంటల వరకు ద్వారాబంధనం బుధవారం 7 గంటల తరువాత సంప్రోక్షణ అనంతరం అనంతరం కార్యక్రమాలు యధావిధిగా సాగుతాయి.