- ఏడుపాయల వన దుర్గమ్మకు ప్రత్యేక పూజలు.
ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, శ్రీజ దంపతులు బోనం ఎత్తారు. మెదక్ జిల్లా కేంద్రంలో తారక రామ నగర్ నల్ల పోచమ్మ ఆలయంలో కలెక్టర్ రాహుల్ రాజ్, అయన సతీమణి శ్రీజ భక్తి శ్రద్దలతో అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు.ఏడుపాయల దుర్గామాతను కలెక్టర్ రాహుల్ రాజ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ సిబ్బంది శ్రీనివాస్ గౌడ్ ఆలయ మర్యాదలతో సత్కరించారు.
