Take a fresh look at your lifestyle.

ముసాపేటలో ఘనంగా ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు: ముఖ్యఅతిథిగా హాజరైన బండి రమేష్

ముద్ర కూకట్‌పల్లి :
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముసాపేటలో ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చున్ను పాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు టీపీసీసీ ఉపాధ్యక్షులు మరియు కూకట్‌పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
​ఈ సందర్భంగా బండి రమేష్ ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సమాజంలో సోదరభావం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
​ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మోసిన్, జాకీర్, తూము వేణు, తూము సంతోష్, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, సప్పిడి భాస్కర్, పెంటయ్య, తూము వినయ్, కర్రెమ్మ, నారాయణ, సచిన్ తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు

Leave A Reply

Your email address will not be published.