Take a fresh look at your lifestyle.

గోవింద క్షేత్రంలో భక్తుల సేవా స్పూర్తి – ఆలయ అభివృద్ధికి 7 మంది ట్రస్ట్ సభ్యుల చేరిక

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

నాగర్ కర్నూల్‌లో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం (గోవింద క్షేత్రం)లో కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తుల కోరికలను తీర్చే శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తుల విశేష ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు తమ వంతు సేవ చేయాలనే సంకల్పంతో ఏడుగురు ట్రస్ట్ సభ్యులు కమిట్మెంట్‌గా ముందుకు వచ్చారు.

ట్రస్ట్ సభ్యులుగా చేరిన దంపతులు:

సంబు అనిలా – పాండు,

నల్లవెల్లి రాజేందర్ రెడ్డి – మమత,

వంజ భాస్కర్ రెడ్డి – హేమలత,

పోరెడ్డి గోపాల్ రెడ్డి – శ్రీదేవి,

మర్యాద అనిల్ కుమార్ రెడ్డి – నీరజ,

అబ్బ గోవిందరెడ్డి – శ్రీలత,

చనుగొమ్ముల మధుసూదన్ రెడ్డి – రమ దంపతులు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, స్వామివారి సేవలో భాగస్వామ్యులైన ఈ ట్రస్ట్ సభ్యులు మరియు వారి కుటుంబ సభ్యులకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. భక్తి భావంతో చేపట్టిన ఈ సేవా కార్యక్రమాలు ఆలయ అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.