వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
రైతులు ఎప్పుడూ ఒకే రకమైన పంటలు కాకుండా ఆధునికతను జోడించి మార్కెట్లో డిమాండ్ కనుగుణంగా పంటల సాగు పైన దృష్టి సారించాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర పొర సరఫరాల సంస్థ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం జగిత్యాల ఆద్వర్యంలో జగిత్యాల రూరల్ మండలం చల్గల్ వ్యవసాయ మార్కెట్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు ద్వారా స్థానిక రైతులు తమ వరి ధాన్యాన్ని సమీపంలోనే అమ్ముకోవడం సాధ్యపడుతుందని, రవాణా ఖర్చులు తగ్గి, ధాన్యం అమ్మకంలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గి, రైతులకు మంచి మద్దతు ధర వస్తుందని అన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో రైతుల సౌకర్యార్థం 105 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అని, ఇందులో పాక్స్ 67, సెర్ప్ 37, మెప్మ 01 ఆద్వర్యం లో ఏర్పాటు కి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రైతు ముంగిట్లో శాస్త్ర వేత్తలు లాంటి గొప్ప కార్యక్రమం చేపట్టారని, రైతులు అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అన్నారు. రైతులు నిత్య విద్యార్తి గా ఉండాలి అని, నూతన సాంకేతికత, నూతన పంటల వైపు మొగ్గు చూపాలి అని, అప్పుడే స్థిరమైన ఆదాయం పొందుతారని అన్నారు. సన్న బియ్యం పంపిణీతో సన్న వడ్ల సాగు కు అవకాశం ఉందని, సన్న వడ్ల కు రూ.500 బోనస్ తో రైతులకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. దొడ్డు రకం వడ్ల కు మద్దతు ధర ఉన్నా మార్కెట్ లో డిమాండ్ లేదని, వరితో పాటు ఇతర పంటల సాగుపై రైతులు ఆలోచన చేయాలని కోరారు. వడ్ల కొనుగోలు లో ధాన్యం కటింగ్ లేకుండా చూడాలని, రైతులు నాణ్యమైన ధాన్యం మార్కెట్ లోకి తీసుకురావాలని అన్నారు.
రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, రెండవ విడత రైతు బందు నిధులు మంజూరు చేయటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి ఎస్ లత, మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, dcc అధ్యక్షులు గాజంగి నందయ్య, AMC ఛైర్మెన్ గడ్డం నారాయణరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, Dco మనోజ్Dcso జితేందర్ రెడ్డి, ఎమ్మార్వో హాకిం, DMO ప్రకాష్, సెక్రటరీ శ్రీనివాస్ రావు, మాజీ AMC ఛైర్మెన్ నక్కల రవీందర్ రెడ్డి, నాయకులు బాల ముకుందం, జిల్లా మండల సర్పంచుల ఫోరమ్ గంగారెడ్డి, కట్ట రాజేందర్, ఏఎంసి డైరెక్టర్లు, సర్పంచులు, నాయకులు, రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.