రెండు వారాల కిందట జరిగిన పహల్గామ్ దాడితో రగిలిపోతోన్న భారత్.. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై సైనిక దాడి చేసింది. ఈ ఆపరేషన్లో ఆర్మీ, ఎయిర్ఫోర్స్, నేవీ పాల్గొన్నాయి. పుల్వామా దాడికి ప్రతీకారంగా బాలాకోట్ తర్వాత భారత సైన్యం అతిపెద్ద దాడి చేసింది. జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకుంది, దీనికి లష్కరే తోయిబా అనుబంధ సంస్థ బాధ్యత వహించింది.
బుధవారం తెల్లవారుజామున భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో ఉగ్రవాద స్థావరాలపై సైనిక దాడిని ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో ఆర్మీ, ఎయిర్ఫోర్స్, నేవీ సంయుక్తంగా పాల్గొన్నాయి. 1971 తర్వాత పాకిస్థాన్ భూభాగంలోకి త్రివిధ దళాలు ప్రవేశించి దాడి చేశాయి. పుల్వామా ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా 2019లో బాలాకోట్లోకి వెళ్లిన తర్వాత భారత సైన్యం నిర్వహించిన అతిపెద్ద దాడి ఇదే.
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో, 26 మంది పౌరులు చనిపోయారు. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT)కు చెందిన అనుబంధ సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్ బాధ్యత వహించింది. పాకిస్థాన్ సైన్యం మద్దతుతోనే పహల్గామ్ దాడి జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి.. దీంతో భారత్ పాక్కు సరైన బుద్ది చెప్పాలని భావించింది. తొలుత దౌత్యపరమైన ఆంక్షలు విధించింది. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా రద్దుచేసి.. పాక్ పౌరులను వెనక్కి పంపడం.. అట్టారీ-వాఘా సరిహద్దును మూసివేసింది.
అన్ని విధాలుగా పాక్ నడ్డి విరిచిన తర్వాత మెరుపుదాడులు చేసింది. కేవలం 23 నిమిషాల్లోనే సైన్యం పనిపూర్తిచేసి.. సురక్షితంగా పాక్ భూభాగం నుంచి వెనక్కి వచ్చేశారు. ఆపరేషన్ అనంతరం అమెరికా, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, సౌదీ అరేబియా సహా పలు దేశాలకు వివరణ ఇచ్చింది. భారత్ సైన్యం ఆపరేషన్ సిందూర్ అనే పేరుతో చేసిన ఈ దాడులకు స్కాల్ప్ క్షిపణులు, హమార్ బాంబులు, కామికాజీ డ్రోన్లను వినియోగించింది.
- ఆపరేషన్ సిందూర్లో వాడిన ఆయుధాలు:
1. SCALP (Storm Shadow) మిసైల్
గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే దీర్ఘశ్రేణి క్రూయిజ్ మిసైల్. 250 కిమీ కంటే ఎక్కువ పరిధిలోని లక్ష్యాలను ఖచ్చితంగా చేరుకోగలిగే సామర్థ్యం దీని సొంతం.
2. HAMMER బాంబు (Highly Agile Modular Munition Extended Range)
50 నుంచి 70 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కొట్టగలిగే సామర్థ్యం ఉన్న హామర్.. బంకర్లు, బహుళ అంతస్తుల భవనాలపై దాడి చేసి ధ్వంసం చేయగలదు. వీటిని లష్కరే తొయిబా, జైషే ముహ్మద్ శిక్షణా శిబిరాలపై ఉపయోగించారు.
3. Loitering Munitions (కామికాజీ డ్రోన్లు)
లక్షిత ప్రాంతాలపై ఎగురుతూ గాలిలో ప్రయాణించే డ్రోన్లు. లక్ష్యాన్ని గుర్తించి స్వయంచాలకంగా లేదా రిమోట్ నియంత్రణతో దాడి చేస్తాయి. గూఢచర్యం, లక్ష్య నిర్ధారణ, తుది దాడుల కోసం వీటిని వినియోగిస్తారు.