శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్-తిరుపతి విమానం రద్దు కావడంతో వారు నిరసన వ్యక్తం చేశారు. సాంకేతిక లోపంతో హైదరాబాద్-తిరుపతి ఎయిర్వేస్ విమానం రద్దయింది. ఈ విషయాన్ని సిబ్బంది చివరి నిమిషంలో తెలియజేశారు. దీంతో ప్రయాణికులు 4 గంటలుగా విమానాశ్రయంలోనే వేచిఉన్నారు. తిరుమల దర్శన సమయం దాటిపోతుందని వారు ఆవేదన చెందుతున్నారు. 47 మందితో ఈ విమానం హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సి ఉంది.