Take a fresh look at your lifestyle.

పోత్నక్ రోజాకు నివాళులర్పించిన పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్, మంత్రిపొన్నం, ప్రముఖులు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ఇటీవల అనారోగ్యంతో మరణించిన పిసిసి ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్ సతీమణి పోత్నక్ రోజా నివాళి శాంతి భోజనాల కార్యక్రమం భువనగిరి పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్, ఎం. ఎల్. సి. బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, డిసిసిబి మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు అండం సంజీవరెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పి ఆర్ ఓ బోరెడ్డి అయోధ్య రెడ్డి, మాజీ శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి, చౌటుప్పల్ ఏసిపి పటోళ్ల మధుసూదన్ రెడ్డి, బీసీ కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి పి. యాదయ్య, మాజీ జడ్పీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, డాక్టర్ గడ్డం విజయ భార్గవ్ తదితరులు పాల్గొని పోత్నక్ రోజా గారి చిత్రపటానికి నివాళులర్పించి అనంతరం శాంతి భోజనాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రమోద్ కుమార్ ని పరామర్శించి కుటుంబ యోగక్షేమాలడిగి భగవంతుడు ఆయన కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల సంఘాల బంధుమిత్రులు బిజెపి జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎండి అవేష్, మాజీ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, డి రాములు, సిపిఎం రాష్ట్ర నాయకులు కల్లూరి మల్లేశం, బట్టుపల్లి అనురాధ, మాయ కృష్ణ, సిపిఐ నాయకులు ఎండి ఇమ్రాన్ ఏశాల అశోక్, ఉప్పల ఉదయ్ ,దళిత సంఘం నాయకులు బట్టు రామచంద్రయ్య , శివలింగం, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు ఇటుకల దేవేందర్ , దర్గాయి హరి ప్రసాద్,కొల్లూరి రాజు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.