ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: హైదరాబాద్ లో సీపీఐ రాష్ట్ర కార్యాలయం మక్ధూమ్ భవన్ పునః ప్రారంభోత్సవ సందర్బంగా తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్ ఎల్ ఎ కూనంనేని సాంబశివ రావు కి సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలకై సింగరేణి ఛైర్మెన్ సి.ఎం.డి బలరాం ప్రకటించినట్లు గా హైద్రాబాద్ లో త్వరగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాట్లు చేయడానికి,తక్కువ పెన్షన్ పొందే విశ్రాంత ఉద్యోగులకు తెల్ల రేషన్ రేషన్ కార్డులు మంజూరు కొరకై, ఉచిత అపరిమిత వైద్య సౌకర్యాలకై,కనీస పెన్షన్ 10,000 రూపాయలు చెల్లింపు కై ప్రభుత్వా లతో చర్చించి పై సమస్యల పరిష్కరించాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శిఆళవందార్ వేణు మాధవ్ వినతి పత్రం సమర్పించారు.