బుద్ధుడు, అంబేద్కర్ మార్గంలో ప్రజా పాలన
ముద్ర, తెలంగాణ బ్యూరో :
గౌతమ బుద్ధుడు, బాబాసాహెబ్ అంబేద్కర్ దార్శనిక మార్గంలో ప్రజాప్రభుత్వం పరిపాలన కొనసాగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బుద్ధుడు, అంబేద్కర్ లు ఆలోచనల విధానమే సకల సమస్యలకు పరిష్కార మార్గమని అయన చెప్పారు. నెక్లెస్ రోడ్ సర్కిల్ వద్దనున్న అబేద్కర్ స్మృతివనం వద్ద విశ్వశాంతిని కాంక్షిస్తూ పాదయాత్ర చేస్తున్న థాయిలాండ్, భారతీయ బౌద్ధ సన్యాసులతో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బుద్ధవనం గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్న ఆయన… అందులో భాగంగా నిధులు కేటాయించడంతో పాటు ఓఎస్డీ మల్లేపల్లి లక్ష్మయ్యను నియమించి అన్ని కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. నాగార్జున సాగర్ వద్దనున్న బుద్ధవనం చాలా అద్భుతంగా ఉంటుందనీ ప్రభుత్వం బుద్ధవనం ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. అక్కడకు వెళితే మానసిక ప్రశాంతత ఏర్పడుందని చెప్పారు. బౌద్ధులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు. బుద్ధవనం ఒక అద్భుతమైన పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రమని ఆయన చెప్పారు. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుందన్నారు బౌద్ధ భిక్షువులకు, పర్యాటకులకు అవసరమైన అన్ని సౌకర్యాలను మేము ఇక్కడ ఏర్పాటు చేశామని చెప్పారు. నెక్లెస్ రోడ్ లోని బాబా సాహెబ్ అంబేద్కర్ సెంటర్ లో మనమంతా సమావేశం కావడం మంచి విషయమని అన్నారు. ఈ కేంద్రంలో బాబా సాహెబ్ అబేద్కర్ జీవిత చరిత్రను, వారి సందేశాలను, వారి చూపించిన మార్గాన్ని రేపటి తరాలకు తరానికి తెలియజేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అంబేద్కర్ గారు మన దేశానికి అందించిన రాజ్యాంగం, సామాజిక న్యాయం పట్ల వారికి ఉన్న నిబద్ధతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. కాగా థాయిలాండ్ నుంచి 70 మంది, మరో 30 మంది భారతీయ బౌద్ధ బిక్షువులు ఫిబ్రవరి 2న కర్నాటకలోని కలబురిగి నుంచి పాదయాత్రను మొదలు పెట్టారు. మార్చి 1 నాటికి నాగార్జున సాగర్ లోని బుద్ధవనం వరకూ వారి పాదయాత్ర కొనసాగునుంది. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖమంత్రి వివేక్ వెంకట స్వామి, బుద్ధవనం ప్రాజెక్ట్ ఓఎస్డీ మల్లేపల్లి లక్ష్మయ్య, కాకి మాధవరావ్ ఐఏఎస్ (మాజీ ప్రధాన కార్యదర్శి)