కోరుట్ల/కథలాపూర్, ముద్ర విలేకరి: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిన్న జరిగిన కార్యక్రమం భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్ జాతీయులను వెంటనే దేశం నుండి పంపించాలని ఎమ్మార్వో కి వినతి పత్రం సమర్పించారు.ఈ మేరకు కథలాపూర్ మండలానికి చెందిన వ్యక్తి “బిజేపీ పార్టీ” పై అసభ్యకరంగా సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశాడు.ఈ సందర్భంగా మండల బిజేపీ ఆధ్వర్యంలో ఆ వ్యక్తి పై కథలాపూర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజేపీ మండల అధ్యక్షులు మల్యాల మారుతి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు కంటే సత్యనారాయణ, ఎడమల వినోద్ రెడ్డి, గాందారి శ్రీనివాస్, బద్రి సత్యం, కాసోజీ ప్రతాప్, జిల్లా కౌన్సిల్ సభ్యులు కథలాపూర్ మహేష్, యాటకర్ల అశోక్, తెడ్డు మహేష్, జీవన్ రెడ్డి, గంగాధర్, శ్రీకర్, మహేష్, ప్రమోద్, రాజేష్, మహేష్ లు పాల్గొన్నారు.