అక్రెడిటేషన్ కార్డు దరఖాస్తులకు ఇంకా గడువు ఉన్నది! తొందర పాటుతో తప్పులు చేయొద్దు! టీయూడబ్ల్యూజే జిల్లా నేతలు
ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి :
అక్రెడిటేషన్ కార్డు దరఖాస్తుల కు సంబంధించి సోమవారం వరకే గడువు అనేది పూర్తిగా అవాస్తవం అని టీయుడబ్ల్యూ జే (ఐజెయు)రాష్ట ఉపాధ్యక్షుడు ఎంఎ కే ఫైసల్, జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి,జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి అసిఫ్ రాష్ట్ర సోషల్ మీడియా ప్రచార కమిటీ సభ్యులు యాదగిరి పేర్కొన్నారు.ఇంకా జిల్లా స్థాయిలో అక్రెడిటేషన్ కమిటీలు ఏర్పాటు కాలేదని వారన్నారు.ఈకమిటీ ఏర్పాటు కావడానికి సమయం పడుతుందని అన్నారు.కమిటీ ఏర్పాటు అయిన తర్వాత సమావేశం జరగడానికి మరో రెండు మూడు రోజులు పడుతుందని చెప్పారు.రాష్ట్ర స్థాయిలో కూడా కమిటీ సమావేశం జరిగి,కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. అర్హులైన జర్నలిస్టు మిత్రులందరికీ కార్డులు వచ్చే విధంగా కొన్ని గైడ్ లైన్స్ రాబోతున్నాయని చెప్పారు. ఈకారణంగా దరఖాస్తు చేసుకునే గడువు ఇంకా ఉన్నదని స్పష్టం చేశారు. జర్నలిస్టు మిత్రులు ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని అన్నారు.అందరూ ఒకటే సారి దరఖాస్తు చేస్తున్నందున,సర్వర్ లో కూడా సమస్యలు వస్తున్నాయని చెప్పారు.ఈ తొందర పాటులో తప్పులు దొర్లే అవకాశం ఉన్నదని వారు అన్నారు.తప్పులు దొర్లితే దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయని పేర్కొన్నారు. గడువు ఇంకా ఉన్నందున ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని వారు సూచించారు. రెండు సంవత్సరాల తర్వాత కొత్త కార్డులు వస్తున్నాయని, అర్హులందరికీ అక్రెడిటేషన్ కార్డు రావాలని యూనియన్ నేతలు ఆకాంక్షించారు.