Take a fresh look at your lifestyle.

నాగర్‌కర్నూల్‌లో సెమిస్టర్ పరీక్షల తనిఖీలు డాక్టర్ కే ప్రవీణ

 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న సెమిస్టర్ పరీక్షల సందర్భంగా పరీక్షల నిర్వహణపై పర్యవేక్షణను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ కే ప్రవీణ శుక్రవారం నాగర్‌కర్నూల్ పట్టణంలోని విశ్వ వికాస్ డిగ్రీ కళాశాలను ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పరీక్షా కేంద్రంలో నిర్వహణ, పర్యవేక్షణ విధానాలను పరిశీలించి, విద్యార్థులు నియమాలను కచ్చితంగా పాటించేలా చూడాలని సిబ్బందికి సూచించారు. పరీక్షలు పారదర్శకంగా, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.

డాక్టర్ ప్రవీణతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు, అలాగే సి. శ్యామ్ సుందర్ నేతృత్వంలోని సెట్టింగ్ స్క్వాడ్ కూడా తనిఖీల్లో పాల్గొన్నారు. పరీక్షల సమయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.