ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లాలోని ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను జిల్లా విద్యాశాఖాధికారి రమేష్ కుమార్ విడుదల చేశారు.
వివరాల ప్రకారం,
6వ తరగతి ప్రవేశ పరీక్ష 19-04-2026 తేదీన ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు నిర్వహించబడుతుంది.
7వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రవేశ పరీక్షలు అదే రోజు మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు జరుగుతాయి.
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కనీసం అరగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. అలాగే అభ్యర్థులు అవసరమైన పత్రాలను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని పేర్కొన్నారు.
సమయపాలన పాటిస్తూ పరీక్షలకు హాజరవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు సూచించారు.