Take a fresh look at your lifestyle.

లగచర్ల ఆడబిడ్డలపై లైంగిక వేధింపులు

  • తేల్చిన జాతీయ హక్కుల కమిషన్.
  • ఘటనకు బాధ్యత వహించి రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయాలి.
  • వారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి.
  • బాధ్యులైన పోలీసులను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి. 
  • డిమాండ్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్  ప్రెసిడెంట్ కేటీఆర్.
ముద్ర, తెలంగాణ బ్యూరో: లగచర్ల ఆడబిడ్డలపై లైంగిక వేధింపులు జరిగాయని జాతీయ హక్కుల కమిషన్ తేల్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.అలాగే వారికే బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు.అధికారం మదంతో విర్రవీగుతున్న రేవంత్ రెడ్డికి  కమిషన్ ఇచ్చిన రిపోర్టు  చెంప మీద కొట్టినట్లు ఉందని వ్యాఖ్యానించారు.మహిళలను లైంగికంగా హింసించిన పోలీసులను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలన్నారు.మూడేళ్లలో మళ్లీ బీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుందన్నారు. అప్పుడు  రేవంత్ రెడ్డి ప్రైవేటు సైన్యంలాగా ఓవరాక్షన్ చేస్తున్న పోలీసు అధికారులను వదిలిపెట్ట బోమని హెచ్చరించారు.రిటైర్డ్ అయి ఏ మూలలో దాక్కున్నా  పట్టుకొచ్చి హిసాబ్ కితాబ్ బరాబర్ చేస్తామని హెచ్చరించారు.మంగళవారం హైదరాబాద్ నందీనగర్ లో కేటీఆర్ ను  లగచర్ల బాధితులు కలిశారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం లక్ష రూపాయలను విరాళంగా ఇచ్చారు. తదనంతరం  కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, లగచర్ల ఆడబిడ్డలపై లైంగిక వేధింపులు జరిగాయని, అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందన్న ఎన్ హెచ్ఆర్ నివేదిక స్పష్టం చేసిందన్నారు. ఈ  నివేదికతో అయినా సిగ్గు తెచ్చుకుని రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.రేవంత్ రెడ్డికి సిగ్గు,శరం ఉంటే దళిత గిరిజనులపై జరిగిన అరాచకాలు, లైంగిక వేధింపులకు బాధ్యత వహించి రాజీనామా చేసి క్షమాపణ కోరేవారన్నారు. రేవంత్ రెడ్డికి సిగ్గు, మానం ఏమాత్రం లేనందునే ఇంకా సిఎంగా కొనసాగుతున్నారని  మండిపడ్డారు.
దేశంలో  ఇంకా న్యాయం, ధర్మం బతికే ఉన్నాయని..మానవత్వం కూడా మిగిలే ఉన్నదని ఎన్.హెచ్.ఆర్.సి రిపోర్ట్ తో స్పష్టం అయిందన్నారు. హెచ్.సి.యూ భూముల విషయంలోనూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని బడా ఆర్థిక మోసానికి పాల్పడిందని మొన్ననే సుప్రీం కోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్ కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు.ఈ కమిషన్ కు తోడు సోమవారం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా అధికారం మదంతో విర్రవీగుతున్న రేవంత్ రెడ్డి చెంప మీద కొట్టినట్టుగా రిపోర్ట్ ఇచ్చిందని వ్యాఖ్యానించారు.రేవంత్ రెడ్డి అల్లుడిదని చెప్పుకుంటున్న ఫార్మస్యూటికల్ కంపెనీ కోసం పేదల భూములు గుంజుకునే ప్రభుత్వ ప్రయత్నాన్ని ఎన్.హెచ్.ఆర్. సి అభిశంసించిందన్నారు.ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మాత్రమే కాదు,కొడంగల్ ఎమ్మెల్యేగా కూడా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారన్నారు. అలాగే ఆయనే హోంమంత్రి కూడా ఉన్నారన్నారు.రాష్ట్ర హోంమంత్రిగా పోలీసులు దౌర్జన్యానికి ముక్కు నేలకు రాయాలన్నారు. మనదేశంలోని ఆడపిల్లలు ఎవరూ ఇలాంటి విషయాల్లో అబద్దం చెప్పరన్నారు. థర్డ్ డిగ్రీ.. టార్చర్ పెట్టి శారీరకంగా చిత్ర హింసలు పెట్టి జడ్జి ముంగట చెప్తే ఇంకా కొడతామని చెప్పి  పోలీసులు బెదిరించినట్టు ఎన్.హెచ్.ఆర్.సి రిపోర్ట్ ఇచ్చిందన్నారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో లాకప్పుల్లోని  సీసీటీవీ లు పనిచేస్తలేవటని ఎద్దేవా చేశారు. కొట్టాలి కదా కొడితే దొరకొద్దు అనే సిసిటీవీలు పనిచేస్తలేవన్నారు.బాధ్యులైన పోలీసులపై ఆరు వారాల లోపల చర్యలు తీసుకోవాలని కమీషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఒకవేళ ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే తామే తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించిందన్నారు.కమిషన్ నివేదిక ప్రకారం బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోకుంటే, లగచర్ల గిరిజనులకు న్యాయం చేయకపోతే మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామన్నారు.లగచర్ల బాధితులకు గతంలో అండగా ఉన్నాం,మొన్న అండగా ఉన్నాం,ఈరోజు అండగా ఉన్నాం,రేపు కూడా వాళ్ళకి న్యాయం జరిగేదాకా అండగా ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేదాకా కొట్లాడుతూనే ఉంటామన్నారు.ఇంత కష్టం లో కూడా మా గురించి ఆలోచించి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు విరాళం ఇచ్చిన లగచర్ల ఆడబిడ్డలకు చేతులు జోడించి హృదయపూర్వక నమస్కారం చేస్తున్నానని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.