రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : గురు పౌర్ణమి పురస్కరించుకొని గురువారం ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక సూపర్ బజార్ షిరిడి సాయిబాబా దేవాలయంలో సాయినాధునికి ఆలయ అర్చకుల సమక్షంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు.అలాగే బొక్కలగుట్ట ఋష్యమూక బాలాజీ టెంపుల్ వద్ద దేవత మూర్తుల విగ్రహాలతో గిరి ప్రదక్షణ నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఆలయ కమిటీ సభ్యులు,భక్తులు పాల్గొన్నారు.
