కోరుట్ల, ముద్ర: విద్యార్థినీ విద్యార్థులు ఏకాగ్రతతో ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంబటి వెంకటరాజం విద్యార్థులకు సూచించారు. కోరుట్ల మండల జోగన్ పల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు జోగన్ పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ నేతృత్వంలో గురువారం ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నుల్లు, పెన్సిళ్లను అందజేశారు. అనంతరం సైదు గంగాధర్ మాట్లాడుతూ విద్యార్థులందరూ కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించాలని, ప్రశాంతంగా చదివి పరీక్షలు రాయాలని, మండల స్థాయిలో మంచి ఉత్తీర్ణత శాతం సాధించి అన్ని రంగాల్లో రాణించాలని విద్యార్థులలో ప్రేరణ కలగజేశారు. ఈ సంవత్సరం జోగన్ పల్లి పదవ తరగతి విద్యార్థులకు వంద శాతం ర్యాంకు తీసుకురావడానికి ప్రయత్నిస్తామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంబటి వెంకట్రాజం పేర్కొన్నారు. గతంలో పాఠశాల విద్యార్థులకు వంద శాతం రిజల్ట్ రావడానికి తీవ్రంగా కృషి చేసిన వెంకటరాజం ను పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎడ్మల భూమారెడ్డి, పోతవేణి రాజశేఖర్, ముత్యపు రాజశేఖర్, కనికారాపు రాజేశం, ఉపాద్యాయులు కామిని లక్ష్మణ్, ఫసియుద్దీన్, టీ. వెంకట సుదీర్, సిహెచ్ యుగధర్ రాజ్, బక్కశెట్టి తిరుపతి, జ్యోతి లక్ష్మి, పి. రామ్ నరేష్, పాల్గొన్నారు.