ముద్ర పెబ్బేరు:
ఇటీవలే జరిగిన పెబ్బేరు మున్సిపాలిటీ ఎన్నికలలో కౌన్సిలర్ గా గెలిచి మున్సిపల్ చైర్మన్ గా శ్రీనివాస్ గౌడ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శ్రీరంగాపూర్ మండలం నాగసానిపల్లి గ్రామ సర్పంచ్ సుజాత రాజశేఖర్, ఆధ్వర్యంలోఆయన ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన కూడా సర్పంచ్ ఉప సర్పంచ్లను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భరత్ కుమార్,మండల కాంగ్రెస్ నాయకులు భీరం రాజశేఖర్ రెడ్డి, ఎల్ల స్వామి, మాజీ ఉపసర్పంచ్ మార్ల కురుమూర్తి, తిరుపతయ్య, గోవిందు, పరుశరం, కిరణ్, నారాయణ, వీరబ్రహ్మం, పరమేష్, శ్రీధర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.