ముద్ర కూకట్పల్లి :
కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మరియు చోరీకి గురైన మొబైల్ ఫోన్లను కనిపెట్టడంలో క్రైమ్ టీం పోలీసులు గొప్ప విజయాన్ని సాధించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం (CEIR Portal) సహాయంతో రికవరీ చేసిన 23 మొబైల్ ఫోన్లను మంగళవారం బాధితులకు అందజేశారు.
కేపీహెచ్బీ ఏసీపీ ఇ. రవికిరణ్ రెడ్డి పర్యవేక్షణలో, క్రైమ్ టీం సభ్యులు గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న మొబైల్ చోరీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్ర ప్రభుత్వ CEIR (Central Equipment Identity Register) పోర్టల్ ద్వారా ఈ ఫోన్ల ఆచూకీని విజయవంతంగా గుర్తించారు.
మొత్తం విలువ: సుమారు ₹4,50,000
కేపీహెచ్బీ క్రైమ్ టీం మరియు టెక్నికల్ విభాగం
ఎస్హెచ్ఓ (SHO) రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా ఆయా ఫోన్లను వాటి యజమానులకు అప్పగించారు. పోయిందనుకున్న ఫోన్లను తిరిగి పొందడంతో బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారు వెంటనే www.ceir.gov.in పోర్టల్లో ఫిర్యాదు చేయాలని, దీనివల్ల ఫోన్లను త్వరగా ట్రాక్ చేసే అవకాశం ఉంటుందని సూచించారు.