- ప్రభుత్వ ఉత్తర్వు జారీ
ముద్ర, తెలంగాణ బ్యూరో :ఈ నెల 30న పదవి విరమణ పొందుతున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి కాంగ్రెస్ సర్కార్ తీపి కబురు చెప్పింది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీఆర్హెచ్ఆర్డీ) వైస్ ఛైర్ పర్సన్ గా శాంతి కుమారికి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్ పదవి విరమణ తర్వాత.. ఆమె ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ వైస్ ఛైర్ పర్సన్ పోస్టుతో పాటు డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.