Take a fresh look at your lifestyle.

తెలంగాణ అంటే మాకు ప్రాణం

  • తెలంగాణపై మా ప్రేమ వర్ణించలేనిది. 
  • ఎంతో మంది ప్రాణత్యాగాలతో ప్రత్యేక రాష్ట్రం. 
  • తెలంగాణ ఆర్థికంగా అభివృద్ధి చేయడంలోనే మా స్టైల్​ కనిపించింది.
  • 45 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే అక్షయపాత్ర కాళేశ్వరం. 
  • డల్లాస్​ లో బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​.
ముద్ర, తెలంగాణ బ్యూరో: 14 ఏళ్ల అలుపెరగని పోరాటంతో సాధించిన తెలంగాణ రాష్ట్రం, ఉద్యమ రథసారథి కేసీఆర్  పాలనలో కేవలం పదేళ్ల వ్యవధిలోనే దేశంలోనే నెంబర్ వన్ స్టేట్ గా ఎదిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ స్టార్టప్ స్టేట్ గా తెలంగాణ నిలిచిందన్నారు.ఇంత అమోఘమైన అభివృద్ధిని సాధించిన రాష్ట్రం దేశంలోనే మరొకటి లేదన్నారు.తెలంగాణను అద్భుత అవకాశాల అక్షయపాత్ర గా, ఇండియాకే ఎకనామిక్ ఇంజన్ గా తీర్చిదిద్దిన ఘనత  కేసీఆర్ కే దక్కిందన్నారు.అమెరికాలోని డల్లాస్ లో ఉన్న డాక్టర్ పెప్పర్ ఎరీనాలో అత్యంత ఘనంగా నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, బీఆర్ఎస్ రజతోత్సవ సంబురాల్లో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  జననీ జన్మభూమిఛ్చా స్వర్గాదపీ గరీయసీ అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన కేటీఆర్ కర్మభూమి మీద కార్యదక్షులై వర్ధిల్లాలన్నారు.అలాగే జన్మభూమి రుణం కూడా తీర్చుకోవాలని ఎన్ఆర్ఐలకు పిలుపునిచ్చారు.తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రాష్ట్రాభివృద్ధికి మరింత చేయూత నివ్వాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.సంకల్పం, పట్టుదల, చిత్తశుద్ధి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని తెలంగాణ  రాష్ట్రం దేశానికి చాటిచెప్పిందన్నారు.14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో, 10 ఏళ్ల తెలంగాణ ఉజ్వల ప్రయాణంలో, అడుగడుగునా కేసిఆర్  వేసిన చారిత్రక ముద్ర వేశారన్నారు.నాలుగు కోట్ల మంది కోసం మహాత్ముని స్ఫూర్తిగా తెలంగాణ కలగన్న కేసీఆర్‌ ఒకే ఒక్కడిగా బయల్దేరారని, ఎన్నో అవమానాలను అధిగమించి తెలంగాణను సాధించారన్నారు.ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తే దశాబ్దాలుగా కొట్లాడితే తెలంగాణ వచ్చిందని చెప్పారు.పోరాడి సాధించిన యోధుడు ముఖ్యమంత్రిగా ఉండటంతో అదే కసి స్ఫూర్తితో పనిచేశామన్నారు.2023లో ఓడిపోయినా తెలంగాణను ప్రేమించడంలో ఎప్పుడూ ముందున్నామని చెప్పారు. మూడేండ్లలో కేసీఆర్‌ మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని వెల్లడించారు.
  • తెలంగాణ తల్లి గర్విస్తోంది.
అమెరికాలోని తెలంగాణవాసులను చూసి తెలంగాణ తల్లి గర్విస్తున్నదని కేటీఆర్ అన్నారు.పుట్టిన గడ్డకు వేలాది మైళ్ల దూరంలో ఉన్నా బతుకమ్మను మరచిపోలేదని కితాబిచ్చారు.బతుకును ఇచ్చిన తెలంగాణను మీరు మరచిపోలేదని ప్రశంసించారు. దశాబ్ద కాలంగా ఎలాంటి ఉత్సాహం కనిపించిందో ఇప్పుడూ అలాగే కనబడుతున్నదన్నారు. నిన్నటి వరకు తెలుగు వారికి రెండు రాష్ట్రాలే ఉన్నాయి అనుకున్నా కానీ నాకు నిన్ననే అర్థం అయింది మనకి రెండు కాదు మూడు రాష్ట్రాలు ఉన్నాయని అది టెక్సాస్‌లో ఉందని, అమెరికాలో ఉన్నట్లు ఎంతమాత్రం అనిపించడం లేదన్నారు. 2015లో పెట్టుబడుల కోసం అమెరికాలో తిరుగుతూ డాలస్‌కు వచ్చామనిపదేండ్ల తర్వాత ఇక్కడకు వచ్చి చూస్తే కేసీఆర్‌ దూతలుగా ఎన్నో చేసి చూపించారన్నారు. జీవితంలో ఎన్నో కలలు కంటారు కొందరు వాటిని సాకారం చేసుకుంటారు. 2001లో నాలుగు కోట్ల మంది కోసం మహాత్ముని స్ఫూర్తిగా కేసీఆర్‌ తెలంగాణ కలగన్నారు.ఒకే ఒక్కడిగా బయల్దేరారు.ఉద్యమం నుంచి తప్పుకుంటే రాళ్లతో కొట్డండన్నారు. శూన్యం నుంచి బయల్దేరి అందరినీ ఏకం చేసి తెలంగాణను సాధించారన్నారు.
  • అదే తెలంగాణ స్టైల్.
2014 జూన్‌ 2న అసాధ్యమైనది సుసాధ్యం చేసిన రోజన్నారు. 60 ఏండ్ల కల నిజమైన రోజన్నారు.  దశాబ్దాల ఆశయాలు, ఆశలు, ఆకాంక్షలు కలలు ఫలించిన రోజని పేర్కొన్నారు. అసాధ్యాలను సుసాధ్యం చేయడమే తెలంగాణ స్టైల్ అని అన్నారు.అసంభవం అనుకున్న ఎన్నో కార్యాలను సంభవం చేసి చూపించింది తెలంగాణ అని అన్నారు.దేశానికి దిక్సూచిగా మారిందన్నారు. దశాబ్దాలుగా స్థిరపడ్డ పెద్ద పెద్ద రాష్ట్రాలను తలదన్నేలా అనతికాలంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందన్నారు.. పదేండ్ల పాలనలో వలసలను నివారించి విముక్తికలిగించామన్నారు.
  • అక్షయపాత్రగా నిలిపాం.
కేసీఆర్‌ ఆలోచనలు, ఊహలు కొందరికి అతిశయోక్తిగా అనిపించవచ్చు ఉద్యమ సమయంలోనే తెలంగాణను ఓ రూపంగా నిలుపుకున్నారని కేటీఆర్ తెలిపారు.కేసీఆర్‌ పాలనలో తెలంగాణ ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.రాష్ట్రం అద్భుతమైన అక్షయపాత్రగా అవతరించిందన్నారు.తలసరి ఆదాయం రూ.1.12 లక్షల నుంచి రూ.3.56 లక్షలకు చేరిందనిదేశంలోనే ఆర్థికాభివృద్ధిలో నంబర్‌వన్‌గా నిలిపామన్నారు.8 ఏండ్లలోనే 10 శాతం పేదరిక నిర్మూలన జరిగిందన్నారు.అప్పులు చేసి ఆదాయాన్ని పోగుచేసి పేదలకు, ప్రజలకు పంచామన్నారు.ఎప్పుడూ మితిమీరి అప్పులు చేయలేదనిఆర్థిక క్రమశిక్షణ వల్ల అప్పుల్లో కింది నుంచి ఆరో స్థానంలో ఉన్నామన్నారు. కరోనా కాలంలోనూ తెలంగాణను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లామన్నారు. ఆనాడు కరెంటు కోతలతో ప్రజలు సతమతమయ్యారు. విద్యుత్‌ సంస్కరణలు చేపట్టి సమస్యను పరిష్కరించామన్నారు.కేసీఆర్‌ విప్లవాత్మకమైన అద్భుతమైన ఇరిగేషన్‌ ప్రాజెక్టులు చేపట్టారని కేటీఆర్ అన్నారు. తుంగతుర్తి, డోర్నకల్‌, మహబూబ్‌సాగర్‌కు నీళ్లు వచ్చాయంటే కాళేశ్వరం వల్లనే అని అన్నారు.నాలుగేండ్లలోనే కాళేశ్వరం నిర్మించిన ఘటన కేసీఆర్‌కు దక్కుతుందన్నారు.45 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే విధంగా కాళేశ్వరంను నిర్మించామన్నారు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు అని 371 పిల్లర్లలో 2 పిల్లర్లు కుంగితే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని విషప్రచారం చేశారన్నారు.. మేడిగడ్డ పిల్లర్లకు మరమ్మతులు చేసి వాడుకలోకి తేవాలని కోరుతున్నా. కాళేశ్వరం ప్రాజెక్టుతో బీడుభూములకు సైతం నీళ్లు మళ్లించామన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో 10 శాతం పనులు మిగిలిపోతే పూర్తిచేయడం లేదని విమర్శించారు.కేసీఆర్‌కు పేరు వస్తుందనే మిగిలిన పనులను పూర్తి చేయడం లేదన్నారు. కోటిన్నర ఎకరాల్లో పంటలను పండించి వ్యవసాయ విస్తరణ సాధించామన్నారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్‌, హర్యానాలను తలదన్ని తెలంగాణ నంబర్‌ వన్‌గా నిలిచిందన్నారు.తెలంగాణలో సంపద పెరిగింది.భూములపై ఎన్‌ఆర్‌ఐలు పెట్టుబడులు పెట్టారన్నారు.బీహార్‌, జార్ఖండ్‌, ఒడిశాల నుంచి వచ్చి మన పొలాల్లో పనిచేస్తున్నారని పేర్కొన్నారు.గ్రామాలు పచ్చగా కళకళలాడితేపట్టణాలు అభివృద్ధికి నిలయాలుగా మారాయన్నారు. తెలంగాణలోని పల్లెలు 30 శాతం అవార్డులు గెలిచాయన్నారు. 27 వేల పైచిలుకు పరిశ్రమలు టీఎస్‌ఐపాస్‌ ద్వారా ప్రారంభించబడ్డాయని లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు.హైదరాబాద్‌కు వచ్చిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ న్యాయార్క్‌లో ఉన్నానా అని అన్నారు.రూ.57 వేల కోట్ల నుంచి రూ.2.41 లక్షల కోట్ల వరకు ఐటీ ఎగుమతులు తీసుకెళ్లిపోయాం.దేశానికి తెలంగాణ గుండెకాయ లాంటిదని ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో లక్షల మంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు కల్పించామని వివరించారు.
  • మార్పులకు అనుగుణంగా.

 కేసీఆర్ తీసుకున్న ప్రతి సంక్షేమం, విధానం కింద మానవీయ కోణం ఉందన్నారు. కేసీఆర్‌ కిట్‌తో శిశు, మాతృ మరణాలు తగ్గాయి. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే స్థాయి నుంచి నేను వెళ్తా గవర్నమెంట్‌ హాస్పిటల్‌కు అన్న స్థితికి తీసుకువచ్చామన్నారు.ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేశామని వివరించారు.ప్రతి జిల్లాకు మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీలు పెట్టింది కేసీఆర్‌ సర్కార్‌. విదేశీ స్కాలర్‌షిప్‌లతో విదేశీ విద్యకు అవకాశం కల్పించామన్నారు. ఇక్కడి విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిసిందని అవసరమైతే లీగల్‌ సెల్‌ ఏర్పాటు చేసి వారికి అండగా నిలబడతామన్నారు.విజ్ఞాన ఆధారిత దేశాలు అభివృద్ధి సాధిస్తాయన్నారు.విదేశాల్లో జాబ్స్‌ పోతాయనే ఆందోళన నెలకొన్నదని మార్పులకు అనుగుణంగా మనం కూడా మార్పును సాధించాలన్నారు.ఎదురయ్యే సాకేంతిక సమస్యను ఎదుర్కొని పరిష్కరించుకోవాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.