- 18 మందిలో ఇద్దరినీ వరించిన అదృష్టం
అచ్చంపేట,ముద్ర: నాగర్ కర్నూల్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలోని మద్యం దుకాణలను సంబంధించి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి గాయత్రి, జిల్లా అదనపు కలెక్టర్ దేవసహాయం, ఆధ్వర్యంలో రద్దయిన బార్లు స్థానంలో నూతనంగా లాటరీ పద్దతిన బార్లు కేటాయించారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలోని రద్దయిన బార్ల స్థానంలో తిరిగి ఏర్పాటు సంబంధించి (02 ) మద్యం దుకాణాలు ఉండగా 18 దరఖాస్తులు వచ్చాయి అని తెలిపినారు. బార్ల కేటాయింపు ప్రక్రియ లక్కీ డ్రా పద్ధతిన పూర్తి పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. బార్లు దక్కించుకున్న వారు పదవ నంబరు వనపర్తికి చెందిన రాజేష్కు తగ్గింది. మరొకటి 18వ నెంబరు సరూర్నగర్కు చెందిన ఆనందుకు దక్కిందని అధికారులు తెలిపారు.
