ముద్ర కూకట్పల్లి:
రంగుల పండుగ హోలీని పురస్కరించుకుని కూకట్పల్లి నియోజకవర్గంలో పండుగ వాతావరణం సంతరించుకుంది. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు తన నివాసంలో కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులతో కలిసి హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు.
ఈ వేడుకల్లో కూకట్పల్లి నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు పరిశుద్ధ కార్మికులు కూడా పాల్గొనడం విశేషం. అందరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, మిఠాయిలు పంచుకుంటూ ఆనందోత్సాహాల మధ్య గడిపారు.
ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ.. హోలీ పండుగ చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో సోదరభావం, ఐక్యత, ప్రేమాభిమానాలు మరింత బలపడాలని ఆయన ఆకాంక్షించారు.
”రంగుల్లాంటి వైవిధ్యాలు ఉన్నా, మనమంతా ఒక్కటే అన్న భావనతో సమాజ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.”
— వడ్డేపల్లి రాజేశ్వరరావు
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న పార్టీ శ్రేణులు ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.