ముద్ర ప్రతినిధి,గోదావరిఖని: మెదక్, కరీంనగర్,నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రామగుండం నియోజక వర్గంలోని గోదావరిఖని మార్కండేయ కాలనీకి చెందిన యువతులు మానస,సుమ,మందిర తమ మొదటిసారిగా తమ ఓటు హక్కును గురువారం గోదావరిఖని సెక్రెటరీ హార్ట్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు హక్కును వినియోగించుకున్నారు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ల కోసం ఉపాధ్యాయుల కోసం ఎవరైతే పని చేస్తారో నిజాయితీగలవారికి తమ ఓటు హక్కు వినియోగించుకున్నామని సంతోషం వ్యక్తం చేశారు.