ముద్ర ప్రతినిధి కల్వకుర్తి : కల్వకుర్తి ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో సోమవారం నిర్వహించిన ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్షిప్ మేళా విజయవంతంగా ముగిసింది. ఐటిఐ పూర్తి చేసుకున్న విద్యార్థులకు హెచ్ ఎఫ్ సి ఎల్ కంపెనీ ఇంటర్వెల్ నిర్వహించింది.ఇందులో మొత్తం 28 మంది అభ్యర్థులు పాల్గొనగా వారి అర్హతలను బట్టి ఉద్యోగాల నియామకాలకు ఎంపిక చేసినట్లు కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ లక్ష్మణ స్వామి తెలిపారు.