ముద్ర ప్రతినిధి
ఫిబ్రవరి 9. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో 161 నేషనల్ హైవేచిరుత పులి కలకలం రేపింది. మండల కేంద్రమైన అల్లాదుర్గం ఐబి చౌరస్తా వద్ద చిరుత పులి సంచరిస్తూ గ్రామస్తుల కంటపడింది. సోమవారం రాత్రి 8:30 ప్రాంతంలో పులి అగుపించడంతో దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో ఎవరికి ఎలాంటి హాని తల పెట్టకుండా వాహనాల శబ్దానికి పారిపోయింది. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు..