Take a fresh look at your lifestyle.

మహిళా శిశు సంక్షేమానికి మరిన్ని విధులు కేటాయించండి

  • కేంద్రమంత్రి అన్నపూర్ణ దేవితో మంత్రి సీతక్క, తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం భేటీ

ముద్ర న్యూస్ బ్యూరో న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో చిన్న పిల్లలు, బాలింతలు, గర్భిణీలకు పౌష్టికాహారం కోసం అమలు చేస్తున్న స్కీమ్ లకు కేంద్రం నుండి రాష్ట్రానికి ఎక్కువ నిధులను కేటాయించాలని తెలంగాణ మహిళా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ ఎం.ఏ. ఫహీమ్ కేంద్ర మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖమంత్రి అన్నపూర్ణ దేవిని ఢిల్లీలో కలిసి కోరారు. ప్రస్తుతం తెలంగాణలో అమలుచేస్తున్న స్కీమ్ ల వివరాలు, ఖర్చు చేస్తున్న బడ్జెట్, ఇందులో కేంద్రం వాటాపై కేంద్ర మంత్రికి వివరించారు. కేంద్రం ఇచ్చే నిధులలో వాటా పెంచితే చిన్న పిల్లలు, బాలింతలు, గర్భిణీలకు మరిన్ని స్కీమ్ లు అమలు చేయొచ్చని సీతక్క కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.బాలామృతం, బాలామృతం ప్లస్, ఐసిడీఎస్ ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో
స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.