- గిఫ్ట్ ఏ స్మాయిల్ కార్యక్రమంలో లక్ష రూపాయల చెక్కు అందజేత.
కుషాయిగూడ , ముద్ర విలేఖరి: మాజీ మంత్రి , బిఅర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఅర్ ను కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్ బిఅర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పాండాల శివకుమార్ గౌడ్ మంగళవారం నందినగర్లోని ఆయన నివాసంలో మార్యదపూర్వకంగా కలిశారు. గిఫ్ట్ ఏ స్మాయిల్ కార్యక్రమంలో భాగంగా లక్ష రూపాయల చెక్కును కెటిఅర్ కు అందజేసి పుష్పగుచ్చంతో ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. చర్లపల్లి డివిజన్లో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ అభ్యున్నతికి పాటుపడుతున్న శివకుమార్ గౌడ్ కు రానున్న రోజులలో నముచిత స్థానం కల్పిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు గూడురు మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.