ముద్ర మల్కాజిగిరి:
ఆర్థికంగా వెనక పెట్టిన ప్రజలకు వైద్య చికిత్స కోసం అందిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ సద్వినియోగపరచుకోవాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. ఎస్వీ నగర్ లోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో లబ్ధిదారులకు సీఎం ఫండ్ చెక్కులను మాజీ కార్పొరేటర్లు జగదీష్ గౌడ్, శాంతి శ్రీనివాసులు రెడ్డి తో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందించేందుకు తమ కార్యాలయం కృషి చేస్తుందని తెలిపారు.