Take a fresh look at your lifestyle.

నూతన డిఎస్పీని కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

 

ముద్ర పెబ్బేరు

వనపర్తి జిల్లా కేంద్రానికి ఇటీవలే నూతన డిఎస్పీగా పదవి బాధ్యతలు చేపట్టిన గిరిబాబును బుధవారం పోలీస్ కార్యాలయంలో పెబ్బేరు మండల కేంద్రానికి చెందిన బున్యాధిపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించాలని, సమస్యలను త్వరితగతీన పరిష్కరించాలని ఆయనను కోరారు. డి.ఎస్.పి మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణ లో భాగమై ప్రతి ఒక్కరు పనిచేయాలని వారిని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంటిస్టెంట్ సర్పంచ్ వనం మల్లేష్ యాదవ్, సురేష్, మేకల విజయ్, నరసింహ, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.