ముద్ర ప్రతినిధి, భువనగిరి : రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాదాద్రి భువనగిరి జోన్ నూతన డిసిపిగా నియమితులైన అక్షాంశ్ యాదవ్ మంగళవారం కమిషనర్ సుధీర్ బాబుని సిపి క్యాంప్ ఆఫీస్ ఎల్బీనగర్లో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా యాదాద్రి జోన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని,నేరశాతం తగ్గింపుకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని కమిషనర్ డిసిపికి సూచించారు.విజిబుల్ పోలీసింగ్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, మహిళా భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.