రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : పులిమడుగు నేషనల్ హైవే అండర్ బ్రిడ్జి కింద గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు పట్టణ ఏఎస్సై వెంకన్న తెలిపారు. సోమవారం పోలీసులకు అందిన సమాచారం మేరకు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఏఎస్సై పేర్కొన్నారు. మృతి చెందిన వ్యక్తి వయస్సు 45/50 సంవత్సరాల మధ్య ఉంటుందని చెప్పారు.