వికారాబాద్, ముద్ర విలేకరి : నేడు బుధవారం వికారాబాద్ లో పర్యటించుటకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రానున్నారని కౌన్సిలర్ వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అర్ధ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి స్పీకర్తో కలిసి ఎన్నెపల్లి చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహాన్ని ముందుగా ప్రారంభిస్తారని, అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ బాధ్యులు కార్యకర్తలు విద్యాసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.