Take a fresh look at your lifestyle.

నలుగురు హైకోర్టు అదనపు జడ్జీలు ప్రమాణం

ముద్ర, తెలంగాణ బ్యూరో : మన రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా నియమితులైన నలుగురు అదనపు న్యాయమూర్తులు శనివారం ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్‌ రేణుకా యారా, జస్టిస్‌ నందికొండ నర్సింగ్‌రావు, జస్టిస్‌ ఇ. తిరుమలదేవి, జస్టిస్ బి.ఆర్‌.మధుసూదన్‌రావుల చేత హైకోర్టు సీజే జస్టిస్‌ సుజయ్‌ పాల్‌ ప్రమాణం స్వీకారం చేయించారు. ఇంతకుముందు రేణుక యారా సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా, నందికొండ నర్సింగ్‌రావు సిటీ స్మాల్‌ కాజెస్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా, ఇ.తిరుమలాదేవి హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్, విజిలెన్స్‌ రిజిస్ట్రార్‌గా, బి.ఆర్‌.మధుసూదన్‌రావు హైకోర్టు రిజిస్ట్రార్‌(పరిపాలన)గా బాధ్యతలు నిర్వర్తించారు. హైకోర్టులో మొత్తం 42 మంది న్యాయమూర్తులకు గానూ తాజా నియామకాలతో కలిపి ప్రస్తుత సంఖ్య 30కి చేరింది.

Leave A Reply

Your email address will not be published.