మాదాపూర్, ముద్ర విలేఖరి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడ లోని శ్రీ అలివేలుమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ భ్రమరాంబికా సమేత శ్రీ మల్లికార్జున స్వామి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు అభయాంజనేయ స్వామి వారి దేవస్థాన సముదాయము లో జరిగిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చతుర్ద వార్షిక బ్రహ్మోత్సవ మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ. ఆలయ కమిటీ పీయేసీ చైర్మన్ గాంధీకి ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో కొలువై ఉన్న విగ్రహ మూర్థులకు ప్రత్యేక పూజలు అందించారు.ఈ కార్యక్రమంలో ఉట్ల కృష్ణ, నర్సింహ యాదవ్, ఉట్ల దశరథ్, రాధ కృష్ణ యాదవ్, మాధవి, రమేష్, మణిరత్నం, ప్రసాద్ మరియు నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

