రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రామకృష్ణాపూర్ పట్టణంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక సూపర్ బజార్ చౌరస్తాలో జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షుడు రాచర్ల సురేష్, ఎంఎస్ఎఫ్ నాయకులు రాజేందర్, సతీష్, మాజీ అధ్యక్షుడు పోషం ,సంపత్, రమేష్, అగయ్య, మల్లేష్, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.