Take a fresh look at your lifestyle.

మళ్లీ రాజకీయ సెగలు….

  • కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
  • మంత్రుల సమక్షంలోనే ఇరు పార్టీలకు చెందిన ఎంఎల్ఎల వాగ్వివాదం, తోపులాటలు
  • కొట్టుకునేంత వరకు వెళ్ళిన పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ లు
  • వెంటనే  రంగ ప్రవేశం చేసిన పోలీసులు
  • బలవంతంగా కౌశిక్ రెడ్డి బయటకు పంపించిన పోలీసులు
  • రసాభాసగా మారిన కలెక్టరేట్ లో జరిగిన సమావేశం
ముద్ర, తెలంగాణ బ్యూరో :- సంక్రాంతి పండుగ సాక్షిగా రాష్ట్రంలో మళ్లీ రాజకీయ సెగలు రాజుకున్నాయి. కొంత కాలంలో రాష్ట్రంలో  కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్  అన్న చందంగా  వార్  సాగుతోంది. దీంతో ఎప్పుడు…ఎలాంటి పరిణమాలు చోటుచేసుకుంటాయో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ పరంగా ఎలాంటి కార్యక్రమాన్ని తలపెట్టినా? లేక  పార్టీల వారిగా కార్యక్రమాలకు పిలుపునిచ్చానా? అవి తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి.  ఇటువంటి ఘటనలు  రాష్ట్రంలో తరుచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఆదివారం  మంత్రుల సమక్షంలో…జిల్లా కలెక్టర్ రేట్ కార్యాలయంలో అధికార, విపక్ష పార్టీలకు చెందిన శాసనసభ్యులు పరస్పరం తీసుకున్నారు. తీవ్ర స్థాయిలో వాగ్వివాదానికి పాల్పడ్డారు. ఒక దశలో కొట్టుకున్నంత పని చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితిలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో  పరిస్థితి దాదాపుగా అదుపుతప్పుతున్నట్లే కనిపించింది.
అయితే సకాలంలో పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో  పరిస్థితి చక్కబడింది. వాదాలకు దిగిన ఎమ్మెల్యేలను సర్ది చెప్పడంతో పాటు  ప్రతిపక్ష పార్టీకి చెందిన శాసనసభ్యుడిని సమావేశం నుంచి బయటకు పంపడంతో గొడవ సద్దుమణిగింది. దీంతో  కరీంనగర్ కలెక్టరేట్‌లో మంత్రులు నిర్వహించిన  సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో ప్రభుత్వ పథకాల గురించి చర్చ సాగుతుండగా.. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (కాంగ్రెస్) జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ (బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన)ల మధ్య మాటామాట పెరిగి పరస్పరం తోసుకున్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చ జరుగుతున్న సమయంలో  కౌశిక్ రెడ్డి .. సంజయ్ తో వాగ్వాదానికి దిగారు.  `అసలు.. నువ్వు ఏ పార్టీలో ఉన్నావ’`ని ఎద్దేవా చేశారు. కేసీఆర్ వేసిన బిచ్చంతో గెలిచి.. ఈరోజు మరో పార్టీలో చేరావని ఏకీ పారేశారు. సిగ్గు,లజ్జ, మానం ఉంటే.. మొగుడివైతే.. రాజీనామా చేసి ఎన్నికలలో గెలవాలని సంజయ్ కు సవాల్ విసిరారు. తన నియోజక వర్గం మీద రేవంత్ సర్కారు కావాలని.. చిన్న చూపుచూస్తోందనిస నిధులు మంజురు చేయడం లేదని ఫైర్ అయ్యారు. తాను దళిత బంధు పథకం, బీసీ బంధు,  ఇతర నిధుల కోసం ప్రశ్నిస్తున్నందుకు తన మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారని కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో రైతులకు 50 శాతమే రుణమాఫీ జరిగిందని.. మిగతా 50 శాతం రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో 18,500 కుటుంబాలకు దళిత బంధు ఇచ్చారని.. రెండో విడత దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
‘ప్రతి క్షణ రైతుల పక్షాన నిలబడతామన్నారు.అన్నదాతలకు ఇస్తామన్న రూ.15 వేలు రైతు భరోసా ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.ఈ వ్యాఖ్యలతో సమావేశంలో మరింత హీట్ ను పెంచింది. దీనిపై  అధికార ప్రజాప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. ఫలితంగా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల పరస్పర ఆరోపణలు…ప్రత్యారోపణలు, విమర్శలు…ప్రతివిమర్శలతో సమావేశం దద్దరిల్లింది. దీంతో పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేసి కౌశిక్ రెడ్డిని బలవంతంగా సమావేశం నుంచి బయటకు పంపారు. అనంతరం ఉద్రిక్త పరిస్థితులు కాస్త…. చక్కబడ్డాయి.
అనంతరం మీడియాతో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ,  బీఆర్ఎస్ బీఫామ్‌తో గెలిచి సంజయ్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని.. కాంగ్రెస్ ఎమ్మెల్యేని అంటూ చెప్పుకొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ తరఫున మాట్లాడితే మేం చూస్తూ కూర్చోవాలా.? అని నిలదీశారు. ఏ పార్టీ అని అడిగితే దాడి చేసినట్టేనా.? అని ప్రశ్నించారు. ఇలా సభలో  నిలదీసినందుకే తననుపోలీసులు బయటకు లాక్కొచ్చారన్నారు. అయినప్పటికీ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.