కోరుట్ల/కథలాపూర్, ముద్ర విలేఖరి: కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ నెల 22 వ తేదీన చేపట్టనున్న “హిందూ ఎక్తా యాత్ర” వాల్ పోస్టర్ ని కథలాపూర్ మండల కేంద్రంలో ఆవిష్కరించారు.హిందువులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల బిజేపీ అధ్యక్షులు మల్యాల మారుతి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు రాచమడుగు వెంకటేశ్వర్రావు, కంటే సత్యనారాయణ, బండ అంజయ్య, పిడుగు ఆనంద్ రెడ్డి, గాందారి శ్రీనివాస్,కథలాపూర్ మహేష్,నరెడ్ల రవి, గడ్డం జీవన్ రెడ్డి,మల్యాల శ్రీకర్, కోరుట్ల రాజేష్ పాల్గొన్నారు.